28.7 C
Hyderabad
April 24, 2024 05: 27 AM
Slider శ్రీకాకుళం

తులసమ్మ ప్రాణాలు తీసిన 108 సిబ్బంది

#Ambulance

శ్రీకాకుళం జిల్లాలో మరొక దారుణం జరిగింది. 108 వాహనాల సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయింది. పాముకాటుకు గురైన మహిళను శ్రీకాకుళం తరలించేందుకు రెండు 108 వాహనాల సిబ్బంది మద్య తలెత్తిన వివాదం ఈ దుర్ఘటనకు దారితీసింది.

ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించకుండా గంటపాటు వాదించుకున్న రెండు 108 వాహనాల సిబ్బంది. గంట తర్వాత 108 వాహనం ఎక్కించకుండానే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఇచ్ఛాపురం మండలం ముచ్చింద్రకు చెందిన సాడి తులసమ్మ కు పాముకాటుతో పరిస్థితి విషమించడంతో రిమ్స్ కు రిఫర్ చేశారు ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రి సిబ్బంది.

ఇచ్ఛాపురం 108 వాహనాన్ని కోవిడ్ పేషెంట్లకు కేటాయించడంతో కవిటి నుంచి వాహనాన్ని పిలిపించారు. తాము ఉండగా కవిటి నుంచి మరో వాహనం ఎలా వస్తుందంటూ వారు వాగ్వాదానికి దిగారు. 108 వాహనాల సిబ్బంది వాగ్వాదంతో మూడు గంటల పాటు వైద్యం అందకపోవడంతో తులసమ్మ మృతి చెందింది.

Related posts

భారతదేశానికి స్వాతంత్య్రము తెచ్చిన బోసినవ్వుల బాపూజీ

Satyam NEWS

గ్రామ సచివాలయంకు వాటర్ కూలర్ వితరణ

Satyam NEWS

యూపీ ఎన్నికల్లో మరోసారి కమల వికాసం

Sub Editor

Leave a Comment