అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం సిబ్బందిపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది.
సోమ వారం రాత్రి 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
దేవాలయ భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అందించిన ప్రాథమిక సమాచారం.
ఈ మేరకు దేవస్థానంలోని ఏడు విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్బాబును ఆదేశిస్తూ దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.