రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఒకేసారి 14 మంది కలెక్టర్లను బదిలీ చేసారు. ఆ 14 మంది కలెక్ఠర్ల జాబితాలో విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ పేరు కూడా ఉంది. ఆయన స్థానంలో సీవిల్ సప్లై శాఖ కమీషనర్ సూర్యకుమారిని నియమించింది.
కలెక్టర్ హరిజవహర్ లాల్ ను రెవెన్యూ శాఖ కమీషనర్ గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసారు… రాష్ట్ర ముఖ్యకార్యదర్శి. వైద్యశాఖ ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా తూ.గో. కలెక్టర్ మురళీధర్రెడ్డిని బదిలీ చేశారు. కడప జిల్లా కలెక్టర్గా విజయరామరాజును బదిలీ చేశారు.
తూ.గో. జిల్లా కలెక్టర్గా సీహెచ్. హరికిరణ్ ను నియమించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా వినయ్చంద్, విశాఖ జిల్లా కలెక్టర్గా ఎ.మల్లికార్జున నియమితులయ్యారు. పౌరసరఫరాల శాఖ వీసీ, ఎండీగా జి.వీరపాండియన్ నియమితులయ్యారు.
కర్నూలు జిల్లా కలెక్టర్గా పి.కోటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చారు. వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్గా కె.వెంకటరమణారెడ్డి, ప.గో.జిల్లా జేసీగా సుమిత్కుమార్ బదిలీ (రైతుభరోసా కేంద్రం) అయ్యారు. శ్రీకాకుళం జేసీగా బి.ఆర్.అంబేడ్కర్, చేనేత శాఖ సంచాలకుడిగా పి.అర్జున్రావు నియమితులయ్యారు. దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్కు కమిషనర్గాను అదనపు బాధ్యతలు అప్పగించారు.