నైజీరియాలోని దక్షిణ నైజర్లో పెను విషాదం చోటు చేసుకుంది. గోల్డ్ మైన్ కూలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలతో తీవ్రంగా గాయపడగా.. చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. నైజీరియా సరిహద్దుల్లోని దక్షిణ నైజర్లో ఆర్టిసానల్ గోల్డ్ మైన్ ఒక్కసారిగా కుప్పకూలింది.
ప్రస్తుతానికి 18 మంది చనిపోయారని, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అనేక మంది పౌరులు గాపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.