36.2 C
Hyderabad
April 23, 2024 22: 13 PM
Slider ఆధ్యాత్మికం

అయ్యప్ప దర్శనానికి వెళుతూ అనంత లోకానికి…

sabarimala 24

అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తూ ఈ సీజన్లో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. వీరిలో పంబా కొండను అధిరోహిస్తున్నప్పుడే 15 మంది చనిపోయారని తెలిపింది. ఏటా నవంబర్ నెలలో ప్రారంభమయ్యే అయ్యప్ప స్వామి దర్శనానికి అంతకుముందు నలభై ఒక్క రోజులు (మండలం) దీక్ష చేపట్టి  స్వాములు కొండకు వస్తారు.

ఈ విధంగా నవంబరు 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన భక్తులలో 19 మంది చనిపోయారని తెలిపింది. ఈ సీజన్లో శబరిమల నుంచి సన్నిధానం వరకు కేరళ ప్రభుత్వం 15 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో మొత్తం 30,157 మందికి వైద్య సహాయం అందించగా వీరిలో 414 మందికి అత్యవసర వైద్యం అందించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. మండల పూజ సందర్భంగా రద్దీ కారణంగా చాలామంది అనారోగ్యం బారిన పడినట్లు తెలిపింది.

Related posts

క్యాబినెట్ డెసిషన్: ఈనెల 24 నుంచి పట్టణ ప్రగతి

Satyam NEWS

విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దు

Satyam NEWS

గ్రామాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలి

Satyam NEWS

Leave a Comment