హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్, వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఇరవై రోజుల క్రితం ఈమె వివాహం జరిగింది. పూర్ణిమ అనే ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కార్తీక్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది.
ఇంట్లో వారు వద్దన్నా ఆమె తాను ప్రేమించిన వ్యక్తి అయిన కార్తీక్ ను పెళ్లి చేసుకుని 20 రోజులు కాకముందే మరణించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కార్తికే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్టు పూర్ణిమ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. కార్తీక్ పై హత్య కేసు నమోదు చేయాలని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.