హైదరాబాద్ జూబ్లీహిల్స్లో గల టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం ఫిబ్రవరి 19న అంకురార్పణ నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 20న ధ్వజారోహణం, ఫిబ్రవరి 24న గరుడసేవ, ఫిబ్రవరి 27న రథోత్సవం, ఫిబ్రవరి 28న చక్రస్నానం, మార్చి 1న పుష్పయాగం నిర్వహిస్తారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.