పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 22 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటీవ్ వచ్చింది. గురువారంనాడు ఒక రోజు సభ నిర్వహించడం కోసం అసెంబ్లీ సమావేశం కానున్నది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టులలో 22 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటీవ్ వచ్చింది. కరోనా లేని వారిని మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు రానిస్తామని ఇప్పటికే స్పీకర్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్ కు చెందిన శాసన సభా పక్షం సమావేశాలు నిన్న జరిగాయి.
నేడు కరోనా పాజిటీవ్ వచ్చిన ఎమ్మెల్యేలు ఆయా సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పుడు మరింత మందికి కరోనా సోకుతుందేమోనని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా పాజిటీవ్ వచ్చిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 14 మంది ఉన్నారు. శిరోమణి అకాలీదళ్ కు చెందిన ఎమ్మెల్యేలు ఆరుగురు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.