Slider తెలంగాణ

నిర్మాణదశలో కూలిన వేములవాడ రెండో బ్రిడ్జి

pjimage (5)

వేములవాడ పట్టణంలోని  మూల వాగుపై నిర్మాణ దశలో ఉన్న రెండో బ్రిడ్జి పాక్షికంగా కూలింది. రూ.28 కోట్ల వ్యయం తో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ నిర్మాణపు పనులు నాసిరకం గా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.   4 ఏళ్లుగా ఈ నిర్మాణపు పనులు కొనసాగుతుండగా మొదటి బ్రిడ్జ్ ని పూర్తి చేసిన కాంట్రాక్టర్లు తమకు ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడం తో ఈ నిర్మాణపు పనులు  మధ్యలోనే వదిలి వెళ్లిపోయారు. రెండు రోజులుగా ఎగువ  ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలతో మూలవాగు లో వర్షపు నీటి ప్రవాహం ఉదృతంగా కొనసాగుతున్నది. ఈ ప్రవాహం మూలంగా పాక్షికంగా గా కృంగి .. మధ్యలో కూలింది.కూలిన బ్రిడ్జ్ ను చూడడానికి ప్రజలు బారులు తీరుతున్నారు.

Related posts

అంబేద్కర్ ను అవమానిస్తే జూపూడికి పుట్టగతులుండవ్

Satyam NEWS

దళిత బంధు కాదు ఇది.. టీఆర్ఎస్ ధనవంతుల బంధువు

Satyam NEWS

న్యూ బిగినింగ్: దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment