37.2 C
Hyderabad
April 19, 2024 12: 48 PM
Slider ముఖ్యంశాలు

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

#RoadAccident

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడ్డ వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాడేపల్లిగూడెం వైపు నుండి ఏలూరు వైపు వెళ్తున్న తెలంగాణకు చెందిన కారు బాదంపూడి జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. 

దీంతో ఘటనా స్థలంలోనే కారు డ్రైవర్, పక్కనున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో వెనుక కూర్చున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి.

వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నా అనే వ్యక్తిమృతి చెందాడు.

ఘటనా స్థలానికి చేసుకున్న పోలీసులు మృతులను హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులలో ఒక వ్యక్తి పేరు గిరిగా పోలీసులు గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related posts

కొత్త కార్పొరేషన్ చైర్మన్ లకు జగన్ ప్రభుత్వం షాక్

Satyam NEWS

పాత్రుని వలస ఉన్నత పాఠశాలలో74 వ గణతంత్ర దినోత్సవం

Bhavani

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధిని బలి?

Satyam NEWS

Leave a Comment