కడప జిల్లా పుల్లంపేట తిరు మలయ్యగారిపల్లి మంగళవారం చెరువులో నీటి లోతు చూడటానికి వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాద వశాత్తూ నీటిలో మునిగి మృతి చెందారు.
మృతులల్లో శివశంకర్(24), వెంకటాద్రి(24), రిషి(12) అనే పుల్లారెడ్డిపల్లి హరిజనవాడకు చెందిన వారు ఉన్నారు.
సంఘటనాస్థలికి చేరుకున్న పుల్లంపేట పోలీసులు స్థానికుల సహాయం తో చేరువులో నుంచి మృతదేహాలను వెలికి తీయించి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు.
యువకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.కొడుకుల ను పోగొట్టుకున్న కుటుంబ సభ్యుల బాధ పొగట్ట దానికి స్థానికులు చేసిన ప్రయత్నం వర్ణనాతీతంగా మారింది.