కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ లో 32 వ జాతీయ భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా రవాణా శాఖ అధికారిని శాంత కుమారి, ట్రాఫిక్ డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల్లో భద్రత పై అవగాహన కల్పించేందుకు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మాసోత్సవాలు ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 18 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
previous post