31.2 C
Hyderabad
April 19, 2024 03: 11 AM
Slider ముఖ్యంశాలు

రోడ్డు ప్రమాదాలలో 5గురు మృతి

#road accidents

ఖమ్మం జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదలలో 5గురు మృతి చెందారు. కొనిజర్ల మండల కేంద్రం సమీపంలోని రాష్ట్రీయ ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంకు వద్ధ లారీ కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

చెందారు. హైదరాబాద్ లో ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్న రాజేష్ హైదరాబాదు నుంచి కుటుంబంతో సహా స్వగ్రామానికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. రోడ్డుపై ముందు లారీ ఆగి వుండగా కారును స్లో చేయగా, వెనుక వస్తున్న

లారీ వేగంగా ఢీకొట్టడంతో కారు రెండు లారీల మధ్య ఇరుక్కుపోయింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా మృతులు పారుపల్లి రాజేష్ (36), సుజాత (34) దంపతులతో పాటు కుమారుడు అశ్విత్ (13) గా గుర్తించారు. మరో

కుమారుడు దివ్యజిత్ పరిస్థితి విషమం గా వున్నది. ఆయనను ఖమ్మం ఆసుపత్రికి తరలింపు చికిత్స చేస్తున్నారు. వీరు వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అలాగే పెనుబల్లి మండల కేంద్రంకు సమీపంలో

రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు లారీల డ్రైవర్లు కేబిన్లో ఇరుక్కున్నారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి పోలీసులు వారిని బయటకు తీసినా వారు అప్పటికే మృతి చెందారు. ఈ సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

విజిల్: రాజంపేటలో గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు

Satyam NEWS

వందలాది కొంపలు ముంచిన వీధినాటకం

Satyam NEWS

TAIKA మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment