సంక్రాంతి పండగ కు వచ్చిన ఒక ఐదేళ్ళ చిన్నారి మృత్యువాత పడిన విషాదకర సంఘటన విశాఖపట్నంలో జరిగింది. దాంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. సెలెస్ట్ అపార్ట్మెంట్లో సెల్లార్ వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. దాంతో ఈ ప్రమాదం జరిగింది. ఫార్మా కంపెనీ ఉద్యోగి నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. సుజాతనగర్ కు చెందిన దంపతులు సెలస్ట్ అపార్ట్మెంట్లోని బంధువుల ఇంటికి సంక్రాంతి పండక్కి వచ్చారు. చిన్నారి సెల్లార్ వద్ద ఆడుకుంటుండగా ఈ కారు ఢీకొట్టింది. కిమ్స్ హాస్పిటల్ తీసుకువెళ్తుండగా మార్గం మధ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనితో పండగ తో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
previous post
next post