37.2 C
Hyderabad
March 28, 2024 18: 00 PM
Slider తూర్పుగోదావరి

తూర్పుగోదావరి జిల్లాలో 50 ఏళ్ళ మహిళపై గ్యాంగ్ రేప్,హత్య

warangal

మహిళలకు రక్షణ కల్పిస్తామని, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.  50 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది.

తూర్పుగోదావరి జిల్లాలోని జీ.వేమవరంలో 50 ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చారు. భర్త కుమారుడు మరణించగా, కుమార్తె హైదరాబాద్లో ఉంటున్న క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

ముగ్గురు నిందితుల్లో ఒకరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగామరో ఇద్దరి కోసం గాలిసున్నారు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న తూర్పు గోదావరి జిల్లా పోలీసులు దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్తున్నారు.

Related posts

ధర్మపురిలో వైభవంగా గోదావరి హారతి

Bhavani

ఫేక్ సర్టిఫికెట్ ల ముఠా గుట్టురట్టు

Bhavani

ప్రయివేటు ఆసుపత్రులను తక్షణమే జాతీయం చేయండి

Satyam NEWS

Leave a Comment