వివిధ జిల్లాల్లో భూముల అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.503 కోట్ల ఆదాయం సమకూరింది. హెచ్ఎండీఏ పరిధిలోని బహదూర్పల్లి, తొర్రూరుతో పాటు నల్గొండ, మహబూబ్గర్, గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ప్లాట్లకు ఇటీవల ప్రభుత్వం వేలం వేసింది.
తొర్రూరులో గజానికి గరిష్ఠంగా రూ.50 వేలు, సగటున రూ.20 వేల ధర పలకగా బహదూర్ పల్లిలో గరిష్ఠంగా రూ.38,500, సగటున రూ.25 వేలు వచ్చింది. ఈ రెండు చోట్లా భూముల విక్రయంతో రూ.298 కోట్ల ఆదాయం వచ్చింది. జిల్లాల్లో మహబూబ్నగర్లోని భూత్పూర్లో గరిష్ఠంగా రూ.26 వేలు, సగటున రూ.10 వేల ధర పలికింది