తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వివాహం అనంతరం కొండ పై నుండి కిందికి దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అంబులెన్సు లు వచ్చాయి.
క్షతగాత్రులను కాకినాడ, రాజమహేంద్రవరం, గోకవరం ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 17 మంది పెళ్లి బృందం ఉన్నారు.
మృతులు శ్రీదేవి, శ్రీలక్ష్మి, భాను, ప్రసాద్, దొరగా పోలీసులు గుర్తించారు. వధువు స్వస్థలం రాజానగరం మండలం వెలుగుబంద కాగా, వరుడు స్వస్థలం గోకవరం మండలం ఠాకూర్పాలెనికి చెందిన వారిగా గుర్తించారు.