క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్న పోలీసు బలగాలకు పెద్ద సంఖ్యలో కరోనా సోకడం ఆందోళన కలిగిస్తున్నది.
హైదరాబాద్ పోలీసుల్లో తాజాగా 700 మంది పోలీసులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గత ఏడాది 3800 పోలీసులకు కరోనా సోకింది.
అందులో 41 మంది కరోనాతో మృతి చెందారు. సెకెండ్ వేవ్లో 700 మందికి పైగా పోలీసులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది.
తప్పనిసరిగా పోలీసులు టీకా వేయించుకోవాలని సీపీ అంజనీ కుమార్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు.