ఇప్పటి వరకూ సైన్యంలో దాదాపు 70,000 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెప్పారు. ఈ వైరస్ తో సుమారు 200 మంది మరణించారని తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 3.40 లక్షల మంది కరోనా బారినపడి కోలుకున్నారని చెప్పారు.
భారత సైన్యంలోని 45,576 మంది సిబ్బంది కరోనా బారిన పడగా పడగా 137 మంది మృతి చెందారు. భారత వైమానిక దళానికి చెందిన 14,022 మంది సిబ్బంది కరోనా బారిన పడగా 49 మంది మృతి చెందారు. భారత నావికాదళానికి చెందిన 7,747 మంది సిబ్బంది కొవిడ్ బారిన పడగా నలుగురు మృతి చెందారు అని భట్ వివరించారు.