చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్ లో ఘోరం జరిగింది. అక్కడి ఒక ప్రహరీగోడ కూలిపోవడంతో 8 మంది వరకూ మరణించారు.
ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రహరీ గోడ కూలి అక్కడి సమీపంలో ఉన్న ఐదు ఇళ్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తక్షణమే అక్కడకు చేరుకున్నారు.
ఆయనతో బాటు ఆయన సోదరుడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా వెళ్లారు. బాధితులతో మాట్లాడారు.