హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
నాగర్కర్నూల్ జిల్లాలో ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో చిక్కుకున్న మృతదేహాలను పోలీసు సిబ్బంది వెలికితీస్తున్నారు.
ఘటనాస్థలిలో కొన్ని మృతదేహాల భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి.
ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారని డీఎస్పీ నరసింహులు తెలిపారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.