34.2 C
Hyderabad
April 23, 2024 14: 33 PM
Slider ప్రత్యేకం

హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై ఘోర ప్రమాదం: 8 మంది మృతి

#road accident

హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉప్పునుంతల మండలం చెన్నారం గేట్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో చిక్కుకున్న మృతదేహాలను పోలీసు సిబ్బంది వెలికితీస్తున్నారు.

ఘటనాస్థలిలో కొన్ని మృతదేహాల భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి.

ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారని డీఎస్పీ నరసింహులు తెలిపారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.

Related posts

జర్నలిస్టుల కరోనా వైద్య సహయ కోసం సమన్వయకర్తలు

Satyam NEWS

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

Satyam NEWS

తిరుమలేశుడి సన్నిధిలో సూపర్ స్టార్  

Murali Krishna

Leave a Comment