అమెరికా కు వెళ్లే ఎనిమిది విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఈ ఎనిమిది ఎయిర్ ఇండియా విమానాలు: ఢిల్లీ-న్యూయార్క్, న్యూయార్క్-ఢిల్లీ, ఢిల్లీ-చికాగో, చికాగో-ఢిల్లీ, ఢిల్లీ- శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ ఫ్రాన్సిస్కో-ఢిల్లీ, ఢిల్లీ-నెవార్క్ మరియు నెవార్క్-ఢిల్లీ. ఎయిర్క్రాఫ్ట్ నావిగేషన్ సిస్టమ్లకు అంతరాయం కలిగించే 5G ఇంటర్నెట్ను ఉత్తర అమెరికాలో విస్తరించినందున బుధవారం నుండి భారతదేశం-యుఎస్ మార్గాల్లో ఎనిమిది విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేస్తున్నట్లు DGCA చీఫ్ అరుణ్ కుమార్ తెలిపారు. మొత్తం మూడు క్యారియర్లు-అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా-ప్రస్తుతం భారతదేశం మరియు యుఎస్ మధ్య ప్రత్యక్ష విమానాలను నడుపుతున్నాయి. 5 జి వల్ల తలెత్తే సమస్యలపై అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్ స్పందించలేదు. 5 జి ఇంటర్నెట్ విమానం రేడియో ఆల్టిమీటర్ ను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. 5G జోక్యం వల్ల ఇంజన్, బ్రేకింగ్ సిస్టమ్లను ల్యాండింగ్ మోడ్కి మార్చకుండా నిరోధిస్తాయని అధికారులు తెలిపారు. దీనివల్ల విమానం రన్వేపై దిగే అవకాశం లేకుండా పోతుందని కూడా అంటున్నారు.
previous post