28.7 C
Hyderabad
April 20, 2024 03: 59 AM
Slider చిత్తూరు

మూడు ప్రాంతాల్లో 85ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పాపనాశనం, తిరుమల ఘాట్ రోడ్డు పరిధిలో 85ఎర్రచందనం దుంగలు, నాలుగు ద్విచక్రవాహనాలు, మరో అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ లను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 9మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్సు ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన మూడు బృందాలు శుక్రవారం రాత్రి నుంచి తిరుమల, పాపనాశనం ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఒక టీమ్ పాపనాశం పరిధిలో 30ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో టీమ్ తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులోని 7వమైలు వద్ద కొంత మంది ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళుతుండగా చుట్టుముట్టారు. వీరి నుంచి 30ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి 8మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు.

వీరి నుంచి నాలుగు మోటారు సైకిళ్లు, ఒక అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ స్వాధీనం చేసుకన్నారు. పట్టుకున్నవారందరూ స్థానికులు కాగా, వారిని పెంచలయ్య (49), పరంధామయ్య (45), సందూరి సుబ్రమణ్యం (36), బోయలగడ్డ మునస్వామి (68), మంకు వరదరాజులు (60), నారగంటి మురళి (45), కొండారెడ్డి చెంగల్రాయుడు (36), మల్లికార్జున (25) ఉన్నారు. అదే విధంగా మరో టీమ్ తిరుమల నుంచి తిరుపతి వచ్చే మార్గంలో 6వ మైలు వద్ద కొంతమంది ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళుతుండగా టాస్క్ ఫోర్సు టీమ్ చుట్టుముట్టే ప్రయత్నం చేసింది.

అందులో ఒకరిని అరెస్టు చేయగా, అతనిని ఆరుముల్ల శ్రీనివాసులు (24)గా గుర్తించారు. వీరి నుంచి 25దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 85 ఎర్రచందనం దుంగలు 1.5టన్నుల బరువు ఉన్నాయని, వీటి విలువ రూ.1.20కోట్లు ఉంటాయని సీఐ తెలిపారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలింపులు చేపట్టినట్లు తెలిపారు. టాస్క్ పోర్సు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

పువ్వాడను కలిసిన బార్ కమిటి.

Murali Krishna

“కౌశిక వర్మ దమయంతి” చిత్రం సాంగ్ ను లాంచ్

Satyam NEWS

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS

Leave a Comment