ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు (మం) రాపార్ల గ్రామం లో పెను విషాదం చోటు చేసుకున్నది. మిరపకాయలు కోత పనికి వచ్చి తిరిగి ట్రాక్టర్ లో ఇంటికి వస్తున్న 9 మంది కూలీలు కరెంటు షాక్ తో మరణించారు. ట్రాక్టర్ పై ఉన్నవారికి హైటెన్సన్ వైర్లు తగిలి 9మంది దుర్మరణం పాలయ్యారు.
మృతులు అందరూ రాపార్ల గ్రామానికి చెందిన వారు. ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనాస్థలనికి చేరుకున్న పోలీసులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు.