34.2 C
Hyderabad
April 19, 2024 21: 03 PM
Slider ఆంధ్రప్రదేశ్

9న కొప్పరపు కవుల కళాపీఠం మహాసభ

kopparapu

సాహిత్య సేవలో విశిష్టత కనబరిచే కొప్పరపు కవుల కళాపీఠం మరో సంగీత సాహిత్య ఆధ్యాత్మిక సమాగమ సాంస్కృతిక మహాసభ నిర్వహిస్తున్నది. ఈ నెల 9వ తేదీ విశాఖపట్నం కళాభారతి AC ఆడిటోరియమ్ లో సాయంత్రం 6 గంటలకు ఈ అద్భుత సమాగమం జరుగుతుందని నిర్వాహకుడు మా శర్మ తెలిపారు. ఈ సంగీత సాహిత్య ఆధ్యాత్మిక సమాగమ సాంస్కృతిక మహాసభ లో కుర్తాళ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామి ( పూర్వాశ్రమ విఖ్యాత డాక్టర్ ప్రసాదరాయ కులపతి) వారికి ” గురుపూజ”- సుప్రసిద్ధ గాయని పి సుశీల గారికి కొప్పరపు కవుల “జాతీయ ప్రతిభా పురస్కారము” – అవధాన కవివృద్ధులు ఆశావాది ప్రకాశరావు గారికి “అవధాన పురస్కారము” ప్రదానం చేస్తామని మాశర్మ తెలిపారు.ఇంకా  ఎందరెందరో మహనీయులు పాల్గొనే ఈ సభ  శ్రీ నారాయణతీర్థ తరంగగానముతో శుభారంభమవుతుందని ఆయన వివరించారు.

Related posts

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని సత్వరమే పరిష్కరించాలి

Satyam NEWS

నెల్లూరు వైసిపి లో తిరుగుబాటు: అవినీతి చిట్టా విప్పిన సొంతపార్టీ నేతలు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కొరకు అందరం కలిసి శ్రమిద్దాం

Satyam NEWS

Leave a Comment