26.2 C
Hyderabad
January 15, 2025 16: 49 PM
Slider ప్రత్యేకం

A big question: ఆ 23 మంది గెలిస్తే ఎలా?

#yerraguntla

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల లెక్కింపు సజావుగా సాగుతున్నది. ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. అయితే అందరిని వేధిస్తున్న సమస్య ఒక్కటే. ఆ ఇరవై మూడు మంది గెలిస్తే ఎలా అనేది ఆ ప్రశ్న. రాష్ట్రంలోని 23చోట్ల విచిత్ర పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం జరగనున్న ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపులో 23 మంది అభ్యర్థులు గెలిస్తే ఆ స్థానాల్లో మళ్లీ ఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా హైకోర్టు తీర్పు కారణంగా ఓట్ల లెక్కింపు ఐదున్నర నెలలపాటు నిలిచిపోయింది. ఈ కాలంలో పోలింగ్‌ జరిగిన పలు స్థానాల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 23 మంది మరణించినట్లు ఎస్ఈసీ నిర్థారించింది. జెడ్పీటీసీ స్థానాలలో పోటీచేసిన అభ్యర్థులు ముగ్గురు మరణించగా.. ఎంపీటీసీ స్థానాల్లో పోటీచేసిన వారు 20 మంది కన్నుమూశారు.

దీంతో ఈ స్థానాల్లో మరణించిన అభ్యర్థులు గెలుపొందితే ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేయాలంటూ ఎస్‌ఈసీ కార్యాలయ వివరణ కోరుతూ జిల్లాల అధికారులు లేఖ రాశారు. ఇందుకు కమిషన్‌ స్పందిస్తూ.. ఒకవేళ మృతిచెందిన అభ్యర్థులు విజయం సాధిస్తే ఆ ఫలితాన్ని వెల్లడించి.. తిరిగి ఎన్నిక నిర్వహించాల్సిన స్థానాల జాబితాలో ఆ స్థానాలను చేర్చాలని అధికారులు స్పష్టంచేశారు. ఇక నామినేషన్ల ఘట్టానికి, పోలింగ్‌ ప్రక్రియ మధ్య కూడా ఏడాదిపాటు ఖాళీ ఏర్పడింది. ఈ సమయంలో మరణించిన వారి స్థానాల్లోనూ పోలింగ్‌ను నిలుపుదల చేశారు. వీటన్నిటికి కలిపి ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.

Related posts

సమర్థమైన ఐటి కెరీర్‌ కు కావాల్సిన అర్హతల పై వెబ్‌నార్

Satyam NEWS

జగన్ రెడ్డి మీ పార్టీకి డీఫాక్టో పార్టీ అధ్యక్షుడా?

Satyam NEWS

అగైన్ ఫైర్:జామియా ఇస్లామియా వద్ద కాల్పుల కలకలం

Satyam NEWS

Leave a Comment