39.2 C
Hyderabad
March 29, 2024 16: 40 PM
Slider ఖమ్మం

ఖమ్మం ఏసీపీ పై కేసు నమోదు

#khammamacp

ఓ ఆందోళనలో కాంగ్రెస్ నాయకుడి పై దురుసుగా ప్రవర్తించి,చంపుతానని బెదిరింపులకు పాల్పడిన నగర ఏసిపి ఆంజనేయులు పై కోర్టు ఆదేశాలతో  ఖమ్మం 1 టౌన్ లో కేసు నమోదైంది. ఖమ్మం నగరంలో  గత ఏప్రిల్ 6 వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో  పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న కాంగ్రెస్స్ నేత  మిక్కిలినేని నరేంద్ర పై ఏసీపీ ఉద్దేశ్య పూర్వకంగా కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేసాడు. పైగా చెప్పకూడని భాషలో బూతులు తిట్టాడని, చంపుతానని బెదిరించాడని కాంగ్రెస్ నేత ఖమ్మం 1 టౌన్ లో ఫిర్యాదు చేసాడు. దీనిపై పోలీస్ శాఖలో క్రింది స్థాయి నుంచి డీజీపీ వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోర్టు ను ఆశ్రయించాడు.   ఏసీపీ పై వెంటనే కేసు పెట్టాలని కోర్టు ఆదేశించడంతోపాటు విచారణ చేపట్టాలని పేర్కొన్నది.  కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.

Related posts

ఆర్టీసీ సంస్థను రక్షించుకోవడానికి ప్రజలంతా సహకరించాలి

Satyam NEWS

థాంక్స్ టు ఒంటి కొమ్ము ఖడ్గమృగం సూప్

Satyam NEWS

హయాత్ మీటింగ్: ఎట్టకేలకు స్పందించిన బిజెపి

Satyam NEWS

Leave a Comment