కరోనా డ్యూటీ చేస్తున్నాడు. అతడు ఒక కానిస్టేబుల్. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? ఇతను మామూలు కానిస్టేబుల్ కాదు. హృదయం విశాలమైనది. మనసు మెత్తినది. లాక్ డౌన్ విధులు నిర్వర్తించి ఇంటికి వచ్చిన తర్వాత ఇతను ఏం చేస్తాడో తెలుసా?
సొంత డబ్బులు ఖర్చు చేసి ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేస్తాడు. వాటిని పేద వారికి పంచి పెడుతుంటాడు. అతను హైదరాబాద్ పాతబస్తీ CAR హెడ్ క్వార్టర్స్ లో డే 2010 బ్యాచ్ కానిస్టేబుల్ కుసురు అరుణ్ కుమార్ యాదవ్. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటికే లాక్ డౌన్ లో అనునిత్యం విధులలో పాల్గొంటూ జీవితం అంకితం చేస్తున్నాడు.
జీతంలో నుండి కూడా సగ భాగం పేద ప్రజలకు కేటాయించాలనే ఉద్దేశం తో పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ లోని 800 మందికి అల్పాహారం అందించి మానవత్వం చాటుకున్నాడు. కానిస్టేబుల్ అన్నా నీకు శాల్యూట్.