వరంగల్లో కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ధరావత్ ప్రీతి మృత్తిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలి పిఓడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివమణి డిమాండ్ చేశారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలి, అనస్తిసియా విభాగంలో హెచ్వోడిని, ప్రిన్సిపాల్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని మెడికల్ పీజీ విద్యార్థిని ధారావద్దు ప్రీతి మృతి పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిన జరిపించాలని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రకటించాలని, కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ల పట్ల జరుగుతున్న ర్యాగింగ్ ను గుర్తించి ర్యాగింగ్ ను అరికట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి టీ ఝాన్సీ, ఉపాధ్యక్షురాలు మంగుతాయి, జిల్లా ఉపాధ్యక్షులు జిక్కుల భరత్, నాయకులు చందు చైతన్య, ధరణి,షాను,వనిత, పుల్లారావు, పవన్, సూర్య,రామారావు, తదితరులు పాల్గొన్నారు
previous post