అంబర్పేట్ గోల్నాక న్యూ తులసి రామ్ నగర్ బఫర్ జోన్లో పేరుకుపోవడంతో ఇళ్లల్లోకి పాములు వస్తున్నాయని బస్తీ వాసులు గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు శుక్రవారం తక్షణమే స్పందించిన కార్పొరేటర్ బఫర్ జోన్ లోని మూడు ఎకరాలలో కార్పొరేటర్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ చెత్తాచెదారాన్ని తొలగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసి పరివాహక ప్రాంతంలో కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎవరైనా దురాక్రమలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. గతంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులా దృష్టికి తీసుకువెళ్లామని మూసి పరివాహక ప్రాంతాన్ని సుందరీ కరణ చేసి ఫంక్షన్ హాల్ వాకింగ్ ట్రాక్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు.
సానుకూలంగా స్పందించిన మంత్రులు త్వరలో గోల్నాక డివిజన్ లో పర్యటించి సుందరీకరణ పనులతో పాటు ఫంక్షన్ హాల్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు .
సత్యం న్యూస్, అంబర్పేట