31.2 C
Hyderabad
April 19, 2024 06: 03 AM
Slider తూర్పుగోదావరి

ఈ తల్లి ఏడుపు వినిపిస్తున్నదా పాలకులారా?

#Mother

అంతర్జాతీయ మాతృదినోత్సవాలు జరుపుకోవడం కాదు…. ఈ తల్లి ఆవేదన తీర్చండి ముందు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలానికి చెందిన ఒక తల్లి ఏడుస్తున్నది… ఆమె కన్నీళ్లు తుడిచేవారు కనిపించడం లేదు.

అంతర్జాతీయ మాతృదినోత్సవం జరుగుతున్న విషయం కూడా ఆ తల్లికి తెలియదు… ఆమె ఆవేదన అంతా తన కుమారుడి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలా అనేది మాత్రమే. పాశర్లపూడి గ్రామానికి చెందిన ఈ తల్లి తన ఏడు నెలల బాబును తీసుకుని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నది.

ఆమె బాబుకు మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మూడు రోజుల నుండి ఎన్ని ఆసుపత్రులు తిరిగినా అడ్మిట్ చేసుకోలేదు.

ఎవరూ అయ్యో పాపం అని కూడా అనడం లేదు. ‘‘ నా ఏడు ఏడు నెలల బిడ్డను కాపాడండి’’ అంటూ ఆ తల్లి ఏడుస్తున్నది….. పాలకులారా వినిపిస్తున్నదా? అతి దీనంగా ఏడుస్తున్న ఆ తల్లి పేరు ప్రమీల.

Related posts

అర్హులైన వారు ఓటర్లు గా నమోదు కావాలి

Murali Krishna

దేశం విస్తుపోయేలా ఏపీలో దొంగ ఓట్లు

Satyam NEWS

ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment