28.7 C
Hyderabad
April 20, 2024 09: 09 AM
Slider సినిమా

కేస్-30 చిత్ర బృందానికి సుధీర్ బాబు అభినందనలు

#Hero Sudheerbabu

యువ ప్రతిభాశాలి సందీప్ పైడిమర్రి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న వినూత్న కథాచిత్రం ‘కేస్-30’.

మర్డర్ మిస్టరీ నేపద్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో.. సిద్ధార్ద్ నాయుడు, శ్వేతా గర్గ్, తేజస్విని రావెళ్ల, ‘రంగస్థలం’ మహేష్ ముఖ్య తారాగణం.

పి.ఎన్. ఆర్.ఫిల్మ్ ఫ్యాక్టరీ-యువసాయి క్రియేషన్స్ బ్యానర్స్ పై… పి.నరసింహారావు-బోడా రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీమ్ ప్రముఖ యువ కథానాయకుడు సుధీర్ బాబును కలిసి ఆయన అభినందనలు అందుకుంది.

కేస్ 30 చిత్రం విజయం సాధిస్తుంది

మంచి కాన్సెప్ట్-మంచి టీమ్ తో తెరకెక్కుతున్న ‘కేస్-30’ కచ్చితంగా మంచి విజయం సాధించాలని సుధీర్ బాబు ఆకాక్షించారు. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని, లాక్ డౌన్ కారణంగా ఆగిన ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే..ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్లీ మొదలు కానుంది.

తమను తాము ప్రూవ్ చేసుకోవాలన్న తపన కలిగిన టీమ్ తో రూపొందుతున్న ‘కేస్-30’ అందరికీ చాలా మంచి పేరు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన డెబ్యూ డైరెక్టర్ సందీప్ పైడిమర్రి.. నిర్మాతలు పి.నరసింహారావు-బోడా రాధాకృష్ణలకు కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ చిత్రానికి కథ: సిద్ధార్ద్ నాయుడు, సినిమాటోగ్రఫీ: గౌతమ్ బండ్రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, మాటలు: భరత్ పచ్చా, పాటలు: శశికుమార్ సాకే, సంగీతం: జెరోమ్ ఎస్.వి, నిర్మాతలు: పి.నరసింహారావు-బోడా రాధాకృష్ణ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సందీప్ పైడిమర్రి

Related posts

ఉత్తరాంధ్ర యాదవ యువత అధ్యక్షుడిగా  అప్పన్న

Satyam NEWS

రెండో రోజు రూ.1.15 లక్షల కోట్ల ఒప్పందాలు

Satyam NEWS

సీఎం జగన్ న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా

Satyam NEWS

Leave a Comment