అనంతపురం జిల్లా శీర్పి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు గోపాల్ ఆధ్వర్యంలో పేకాట నిర్వహిస్తున్న ఉదంతం పోలీసుల దాడిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శీర్పి సమీపాన పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో దాడి చేశారు.
16 మందిని అరెస్టు చేసి, 8 ద్విచక్ర వాహనాలు, రూ.2.12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో శీర్పికి చెందిన వైసీపీ నాయకులు గోపాల్, రమేష్, మరొకరు ఉన్నారు. వైసీపీ నాయకుడు గోపాల్ ఆధ్వర్యంలోనే కొన్ని రోజులుగా పేకాట ఆడిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో కర్ణాటక మద్యం 152 టెట్రా ప్యాకెట్లు, 16 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు