జర్నలిస్ట్ ల సమస్యలను పరిష్కరించాలని ఏ పి డబ్ల్యూ జె ఎఫ్ యూనియన్ ఆద్వర్యం లో సోమవారం జర్నలిస్ట్ లు ఏలూరు డి పి ఆర్ ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.అర్హులైన జర్నలిస్ట్ లందరికి అక్రిడేషన్ లు మంజూరు చేయాలని, ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం యూనియన్ నాయకులు ఎస్ కె జాబీర్.కె ఎస్ శంకర్ రావు.శేఖర్. కె గంగరాజు.ఋషిరావు.తదితర జర్నలిస్ట్ లు బైక్ ర్యాలీ తో వెళ్లి స్పందన కార్యక్రమం లో ఉన్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ని కలిసి డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.