విజయవాడ నగరంలో ఏ.ఆర్ కానిస్టేబుల్ ఒకరు దారుణ ఘటనకు పాల్పడ్డాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తిని అతను హతమార్చాడు.
వెంకటేష్ అనే ఐస్క్రీమ్ బండి యజమాని తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఏ ఆర్ కానిస్టేబుల్ కు తెలిసింది.
దాంతో వెంకటేష్ పై అతను నిఘావేసి ఉంచాడు. ఐస్క్రీమ్ బండి యజమాని అయిన వెంకటేష్ తన ఇంట్లోకి వెళ్లినట్లు సమాచారం అందుకున్న కానిస్టేబుల్ డ్యూటీలో నుంచి వెంటనే ఇంటికి చేరుకున్నాడు.
వెంకటేష్ని పట్టుకుని తీవ్రంగా గాయపరిచాడు. ఏఆర్ కానిస్టేబుల్ చేసిన ఈ దాడిలో వెంకటేష్కు తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వెంకటేష్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.