యూఐడీఏఐ ఆధార్ కార్డులను జారీ చేయడమే కాదు.. అప్పుడప్పుడు వివిధ రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. అందులో విజేతలకు బహుమతులు కూడా అందిస్తుంది ఆధార్ సంస్థ. తాజాగా ఉచితంగానే రూ.3 లక్షల వరకు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. దీని కోసం ఆధార్ హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ప్రైజ్ మనీ ప్రకటించింది.
ఈ ఆధార్ హ్యాకథాన్ అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు ఉంటుందని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ తెలిపింది.అయితే https://hackathon.uidai.gov.in/ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారం లక్ష్యంగా ఆధార్ ఈ హ్యాకథాన్ను నిర్వహిస్తోంది. ఈ హ్యాకథాన్లో ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్, ఐడెంటిటీ అండ్ అథంటికేషన్ వంటి థీమ్స్ ఆధారంగా హ్యాకథాన్ ఉంటుంది. ఐదుగురుగా ఒక టీమ్గా ఏర్పడవచ్చు. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరి. ఈ ఆధార్ హ్యాకథాన్లో విజేతకు రూ.3 లక్షలు, రన్నర్గా నిలిచిన వారికి రూ.2 లక్షలు వస్తాయి.