30.7 C
Hyderabad
April 24, 2024 01: 36 AM
Slider నల్గొండ

ఆధార్ సేవల కోసం పోస్టాఫీసులో ప్రత్యేక కౌంటరు ఏర్పాటు

#PostMasterHujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పోస్టాఫీసు కార్యాలయంలో ఈ నెల 30న “ఆధార్ క్యాంపెయిన్” నిర్వహిస్తున్నట్లు హుజూర్ నగర్ పోస్ట్ మాస్టర్ పెనుగొండ వెంకటేశ్వర్లు తెలిపారు.

తపాల కార్యాలయాల్లో రెండు సంవత్సరాల క్రితమే ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని,ప్రభుత్వ పథకాల లబ్ధి ,ప్రైవేట్ అవసరాలకు ఆధార్ తప్పని సరిగా మారిందని ఆయన తెలిపారు.

అందువల్ల తపాలా కార్యాలయాల్లో  అందుతున్న ఆధార్ సేవలపై ప్రజల్లో అవగాహన  పెంచేందుకు ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ అవకాశం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆధార్ నూతన నమోదు ఉచితంగాచేస్తామని, చిరునామా ,మెయిల్ ఐడి మార్పు వంటి వాటికి నిర్ణీత రుసుం వసూలు చేస్తామని అన్నారు.

ఆధార్ సేవల కోసం శనివారం పోస్టాఫీసులో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Related posts

[Official] Best Drugs For Diabetes Type 2 List Diabetics Medicines

Bhavani

ఎంతో వైభవంగా సాగుతున్న దేవీ నవరాత్రులు

Satyam NEWS

ట్రాఫిక్ ఆంక్షలు

Murali Krishna

Leave a Comment