ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి గ్రామ సచివాలయాల్లోనే ఆధార్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. మండల కేంద్రంలోనో లేక మరెక్కడైనా ఒక్క ఆధార్ సేవ కేంద్రం ఉంటే దాన్ని ముందు గంటల తరబడి పడిగాపులు కాసే పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుంది.
ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక నుంచి గ్రామ సచివాలయాల్లోనే ఆధార్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.