37.2 C
Hyderabad
April 18, 2024 22: 46 PM
Slider ఆంధ్రప్రదేశ్

బారాషహీద్ దర్గాలో ఆనం వారసుల ప్రార్ధనలు

Aanam ranga

నెల్లూరు నగర పాలక సంస్థ పాలన సుభిక్షంగా సాగాలని ఆనం రంగమయూర్ రెడ్డి బారాషహీద్ దర్గాలో ప్రార్థనలు చేశారు. రొట్టెలపండుగ సందర్భంగా గురువారం ఉదయం  నగరంలోని బారాషహీద్ దర్గా సందర్శించి షహీద్ సమాధుల వద్ద ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గాకమిటి అధ్యక్షులు, మత పెద్దలు నెమలి పింఛంతో ఆనం రంగమయూర్ రెడ్డి నీ ఆశీర్వదించారు. అనంతరం వారు రొట్టెలపండుగ ఏర్పాట్లపై స్వర్ణాల చెరువు ఘాట్ ను సందర్శించి భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి విచారించారు. తదనంతరం వారు రొట్టెలను పట్టుకుని , గత సంవత్సరం మా ఇంటి పెద్ద మా చిన్నాన్న ఎమ్మెల్యే కావాలని రొట్టె పట్టుకున్నాను, నెల్లూరు ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని, రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు నగర పాలక సంస్థ తీసుకువచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళ్లాలని, కోరారు. ఈ పర్యటనలో షమీమ్,నజీమా, సుగుణమ్మ,సుజాత ముసావిర్,అజస్ ,ముసాదిఖ్ ,గయాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

చక్కెర ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS

పాదయాత్ర ఫీడ్ బ్యాక్ ఆధారంగానే మేనిఫెస్టో

Bhavani

రైతుల బకాయిల చెల్లింపునకుచర్యలు

Satyam NEWS

Leave a Comment