మూడు రోజుల కిందట కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశ వర్కర్ ఒకరు మరణించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశ వర్కర్ బొక్కా విజయ లక్ష్మి కి ఈ నెల 19 వ తేదీన కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.
రెండు రోజులపాటు ఆరోగ్యంగానే ఉన్న ఆమెకు 21న తెల్లవారుజామున చలి జ్వరం వచ్చింది. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళటంతో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మూడు రోజుల వైద్యులు ఆమెకు చికిత్సలు చేసిన ఫలితం లేకుండా పోయింది.
నేడు విజయలక్ష్మి మృతి చెందింది.
ఆశావర్కర్ విజయలక్ష్మి మృతి చెందడంతో కోవిడ్ – 19 వాక్సినేషన్ వేయించుకున్న ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
విజయలక్ష్మి మృతి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం అని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విజయలక్ష్మి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.