36.2 C
Hyderabad
April 25, 2024 21: 53 PM
Slider ప్రత్యేకం

కరోనా వ్యాక్సిన్ వికటించి ఆశ వర్కర్ మృతి

#CoronaVaccine

మూడు రోజుల కిందట కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశ వర్కర్ ఒకరు మరణించారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశ వర్కర్ బొక్కా విజయ లక్ష్మి కి ఈ నెల 19 వ తేదీన కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు.

రెండు రోజులపాటు ఆరోగ్యంగానే ఉన్న ఆమెకు 21న తెల్లవారుజామున చలి జ్వరం వచ్చింది. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళటంతో వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మూడు రోజుల వైద్యులు ఆమెకు చికిత్సలు చేసిన ఫలితం లేకుండా పోయింది.

నేడు విజయలక్ష్మి మృతి చెందింది.

ఆశావర్కర్ విజయలక్ష్మి మృతి చెందడంతో కోవిడ్ – 19 వాక్సినేషన్ వేయించుకున్న ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

విజయలక్ష్మి మృతి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం అని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విజయలక్ష్మి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Related posts

కనక దుర్గమ్మ దసరా ఉత్సవాలపై ఆంక్షలు

Satyam NEWS

కేర్ ఫుల్: పతంగులు ఎగరవేస్తున్నారా జాగ్రత్త!

Satyam NEWS

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదో తరగతి ప్రతిభ పరీక్ష

Satyam NEWS

Leave a Comment