అర్హులైన ప్రతి ఒక్కరికీ అసరా పెన్షన్స్ అందచేయటం జరుగుతుందని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. కాచిగూడ డివిజన్ లోని కర్ణాటక సాహిత్య మందిర్ లో ఆసరా పెన్షన్ పథకం ద్వారా మంజూరైన పేన్షన్స్ ను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు. జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు, కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమ రాణి రమేష్ యాదవ్, ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, డివిజన్ అధ్యక్షులు బిష్మ….ప్రధాన కార్యదర్శి సదా నంద తోపాటు సీనియర్ తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట