31.2 C
Hyderabad
February 14, 2025 21: 21 PM
Slider ముఖ్యంశాలు

జగన్ ఘాతుకానికి చంద్రబాబు మందు

#abvenkateswararao

విశ్రాంత ఐపీఎస్ అధికారి, జగన్ రెడ్డి హయాంలో దారుణ అవమనాలకు గురైన ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని ఏపి ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. జగన్ రెడ్డి హయాంలో 2 దఫాలుగా ఏబీవీపై సస్పెన్షన్ వేటు వేసింది. జగన్ ప్రభుత్వం సమయంలో ప్రదర్శించిన దాష్టీకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొంత వరకు సరిదిద్దింది. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దఫా 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు ఏబీవీ సస్పెన్షన్ అయ్యారు. రెండో విడతలో 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు మరోమారు సస్పెన్షన్ చేశారు. ఈ రెండు సార్లు కూడా ఆయన న్యాయస్థానాల్లో గెలిచారు. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు ఆయన చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇటీవలే ఏబీవీపై నమోదైన అభియోగాలను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Related posts

కళ్యాణం కమనీయం శ్రీ సీతారాముల కళ్యాణం

Satyam NEWS

సాహసం చూపి యాత్రీకులను కాపాడిన కంభం సీఐ

Satyam NEWS

టిడిపికి 50 వేల విరాళం ఇచ్చిన రిటైర్డ్ ఉద్యోగ దంపతులు

Satyam NEWS

Leave a Comment