ఉప్పల్ ఐ డి ఎ లక్ష్మీ నారాయణ కాలనీ లోనీ శ్రీ అభయాంజనేయ స్వామి రామలింగేశ్వరస్వామి సహిత సాయిబాబా దేవస్థానం ప్రధమ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతియేటా వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం హర్షణీయమన్నారు.
ఆలయ కమిటీ కి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ని శాలువాతో సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు జనుంపల్లి వేంకటేశ్వర్ రెడ్డి, శ్రీ అభయాంజనేయ స్వామి రామలింగేశ్వరస్వామి సహిత సాయిబాబా దేవస్థానం, లక్ష్మీనారాయణ కాలనీ అధ్యక్షుడు పసల లుకాస్, దేవాలయ చైర్మన్ శ్రీధర్ ప్రసాద్ ,కోశాధికారి కొక్కొండ బ్రహ్మచారి, కాలనీ కోశాధికారి మధు బాబు, కాలనీ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ అశోక్ గౌడ్, వి భిక్షపతి చారీ ,కార్యదర్శి రాజయ్య గుప్తా, కాలనీ వాసులు పెద్ద వెంకట్ రెడ్డి, నాగేశ్వరరావు, పల్లె రవి ,వల్లూరు శీను, ఆర్ టి సి కుమార్ ,మీసాల రాములు, కాకతీయ ప్రెస్ వెంకట రెడ్డి, మాచర్ల ప్రతిభ భక్తులు కాలనీవాసులు ,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
సత్యం న్యూస్ మేడ్చల్ ప్రతినిధి