ఎస్ సి, ఎస్ టి, బిసి, మైనారిటీ పేద విద్యార్ధులకు అన్యాయం చేసే జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని TNSF డిమాండ్ చేసింది.
గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(TNSF) ఆధ్వర్యంలో ఈ మేరకు సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించింది.
పేద విద్యార్ధులకు మరీ ముఖ్యంగా ఎస్ సి, ఎస్ టి, బిసి, మైనారిటీ లకు నష్టం కలిగించే జీవో 77ను తక్షణమే రద్దు చేయాలని TNSF నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు కూరపాటి హనుమంతరావు డిమాండ్ చేశారు.