నిర్భయ నిందితులకు ఉరి శిక్ష అమలు చేయాలని ఈ ఫొటోలోని వారంతా ఉరి వేసుకున్నట్లు నిరసన తెలుపుతున్నారనుకుంటున్నారా? మీరు తప్పులో కాలేసినట్లే. వీరు అందుకు కాదు ఇలా ఉరి వేసుకున్నట్లు నటిస్తున్నది. వీరంతా విద్యార్ధులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ఎబివిపి ఆధ్వర్యంలో ఈ వినూత్న నిరసన జరిగింది. వ్విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న రూ. 3,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్పులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవి ఇవ్వకపోతే తమకు ఉరి వేసుకోవడమే గతి అని వారు నిరసన వ్యక్తం చేశారు.