31.2 C
Hyderabad
February 14, 2025 21: 26 PM
Slider ప్రత్యేకం

ఐపిఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు

#sainjai

ఏపీ సీఐడీ మాజీ డీజీ ఎన్.సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు అయింది. అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసులో A1గా సంజయ్, A2గా సాత్రిక టెక్నాలజీ సంస్థను పెట్టారు. A3గా Kritvyap టెక్నాలజీ సంస్థను ఏసీబీ చేర్చింది. సంజయ్ ఫైర్, సీఐడీ డీజీగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఇప్పటికే విజిలెన్స్ నివేదిక వచ్చిన విషయం తెలిసిందే. నివేదిక పరిశీలించిన ప్రభుత్వం సంజయ్‌ను సస్పెండ్ చేసింది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికను ఏసీబీకి ప్రభుత్వం పంపింది. ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. సంజయ్‌ను విచారించేందుకు ఇప్పటికే సీఎస్ అనుమతినిచ్చారు.

Related posts

పి‌ఎస్‌ఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆటల పోటీలు

Murali Krishna

రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతుల నిరసన

Satyam NEWS

సరోజన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment