భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ సీఈ ఆనంద్ పై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ నుంచి ఆనంద్ లంచం డిమాండ్ చేశాడు. దాంతో కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల పన్నిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆనంద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తన చేతులతో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆనంద్ చిక్కాడు. రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెండ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.