కర్నూలు జిల్లా నంద్యాలలోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న కోణంలో విచారిస్తున్నారు. గత ప్రభుత్వంలో నీరు – చెట్టులో వేల కోట్లు పనులు చేశారు..దానికి సంబంధించిన కమీషన్ ల రూపంలో కాంట్రాక్టర్లు కొన్ని వందల కోట్లు ఈఈ రాజశేఖర్ కు ముట్టజెప్పారని బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనర్ ఇరిగేషన్ పైనే కాకుండా కేసీ కెనాల్, తెలుగుగంగ కార్యాలయాలలో పనిచేస్తున్న డిఈఈ, ఏఈఈ, జేఈఈ లపై ఏసీబీ అధికారుల కన్ను వేశారని తెలిసింది.