అన్నమయ్య జిల్లా రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో రెండో రోజు శుక్రవారం ఎసిబి సోదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి రోజు గురువారం కార్యాలయంలో ని మొత్తం రికార్డుల ను, ముఖ్యధికారుల సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్న ఏసిబి అధికారులు ఓ గదిలో పెట్టి తాళం వేశారు. స్థానికుల నుంచి రాజంపేట మునిసిపల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ అప్రూవల్ లో అవినీతి జరిగినట్టు ఫిర్యాదులు రావడంతో పాటూ,రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా తనిఖీల లో భాగంగా ఎసిబి దాడులు జరిపి విచారణ చేపట్టారు.
దీనిపై మునిసిపల్ కార్యాలయ అధికారులతో కలిసి ఏసీబీ అధికారుల ఫిర్యాదు బాధితుల వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. నిర్మాణం లో ఉన్న భవనాల కట్టడాల వద్దకు వెళ్లి స్వయంగా కొలతలు వేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 10:30 నుంచి రాత్రి కూడా ఏసిబి విచారణ జరుగుతోంది. ఈ తనిఖీల్లో పాల్గొన్న డీఎస్పీ కంజాక్షయన్, సి.ఐ యల్లమ రాజు, కృష్ణంరాజు,ఎస్సై నగేష్ 10 మంది సిబ్బంది పాల్గొన్నారు.ఇంకా విచారణ కొనసాగుతోంది.పూర్తి అయిన తరువాత వివరాలు వెళ్లాడయ్యే అవకాశాలు ఉన్నాయి.