అనంతపురం రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
గత కొన్ని రోజులుగా కార్యాలయం సిబ్బంది, అధికారుల పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది.
ఏసీబీ దాడులతో కార్యాలయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతపురం నగరం లోని RTO కార్యాలయం లో AMVI ఇస్మాయిల్ వద్ద ఒక లక్షా 65 వేలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ACB DSP కులశేఖర్ కేసు నమోదు విచారణ చేస్తున్నారు. స్పందన ద్వారా ఫిర్యాదుతో దాడులు చేశామని DSP వివరణ ఇచ్చారు.